
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం “భరత్ అనే నేను” సూపర్హిట్ టాక్తో దూసుకుపోతోంది. సామాజిక బాధ్యతతో జనహితం కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర పోషించారు. మరోసారి దర్శకుడు కొరటాల శివ తనదైన కమర్షియల్ ఎలిమెంట్స్తో సామాజిక అంశాలను తెరకెక్కించి విజయవంతమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. రెండురోజుల్లోనే రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది. ఈ భారీ విజయాన్ని మహేశ్ ఆస్వాదిస్తున్నారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యమిచ్చే మహేశ్ బాబు ఈ సినిమా విజయాన్ని కుటుంబసభ్యులతో పంచుకున్నారు. తన సతీమణి నమ్రతకు తన ప్రేమను చాటే ఓ అందమైన ఫొటోతో ఇన్స్టాగ్రామ్లో మహేశ్ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో మహేశ్, నమ్రత లిప్లాక్ చేస్తూ ఉన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.