Wednesday, April 24, 2024

ఈ సారి బస్సు యాత్రలోనే టిడిపి అభ్యర్థుల ప్రకటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానం వేగం పెరిగింది ఆ దిశలో ఐటిడిపి ప్రయాణిస్తూ క్షణాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం తెలుపుతూ ముందుకు వెళ్లాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం ఐటిడిపి ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఐటిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా తాళి కోట హరికృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యుల చేత పమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పరిగెత్తుతున్న దిశలో..ఐటిడిపి ప్రమాణ స్వీకారంతో వారి బాధ్యత పూర్తిస్థాయిలో పెరిగిందన్నారు.ఆరు నెలల కాలంలో ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో..ఐటిడిపి మండల డివిజన్ స్థాయి కమిటీలు వేసుకొని నిరంతర ప్రక్రియ చేపట్టాలన్నారు.

తెలుగుదేశం పూర్వ వైభవం కోసం కృషి చేయాలని..నేడు పోటాపోటీగా పరిగెడుతున్న పార్టీలు చివరికి అలిసిపోయే..పరిస్థితి లేక పోలేదని.. అసమయం లో టిడిపి పార్టీలో సంసిద్ధతగా..ఉంటే కంకణ బద్దులుగా..ఉండి వెంటనే ఈ రోజు పని ఇప్పుడే చేయాలనే విధంగా కొనసాగుతూ..ఇంటింటి కి తెలుగుదేశం కార్యక్రమం ఎలా నిర్వహించారో.. అదే విధంగా ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని కోరారు.. టిడిపి గతంలో ఏమి చేసింది.. ఏమి చేస్తుంది..ఎం చేయాలో బస్సుయాత్ర లోనే వివరిస్తూ..అభ్యర్ధుల ను ప్రకటిస్తాం.. బీదావాణ్ణి కోటీశ్వరులుగా మార్చే ప్రక్రియ జరుగుతుందన్నారు. విజన్ 2020 కాదు 15 సంవత్సరాల్లో తూ చా.. తప్పకుండా ప్రక్రియ జరుగుతుందన్నారు.

అనంతరం పోలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడ నిండా రుద్రాక్షలు.. నోటి నిండా భూతులు మాట్లాడే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఒక మంత్రి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని, అలాంటి పోస్టులు కాకుండా సాంకేతిక నిపుణుల విభాగం చాలా జాగ్రత్తగా పోస్టులు పంపించాలన్నారు. ప్రతి వారానికి 10 రోజుల కొకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని అన్నారు.

ఇంటింటికీ తెలుగుదేశం సక్సస్ అయ్యే విధంగా.. సోషల్ మీడియాలో పార్టీ అభివృద్ధి,ప్రభుత్వాల తప్పిదాలను వేలెత్తి చూపుతూ ప్రజల ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని మాట్లాడుతూ..సోషల్ మీడియా విభాగం చాలా అద్భుతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ముందుకు వెళ్లాలని సూచించారు. జాతీయ అధికార ప్రతినిధి టి. జ్యోత్స్న మాట్లాడుతూ ఐ టిడిపి విభాగం ముందుకు వెళ్లాలని.. ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూ.. చిన్న చిన్న తప్పులను ప్రజలకు తెలిసే విధంగా బట్టబయలు చెయాలన్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని మాట్లాడుతూ..సోషల్ మీడియా విభాగం చాలా అద్భుతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ముందుకు వెళ్లాలని సూచించారు. జాతీయ కార్యదర్శి కాసాని విరేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం చేస్తున్న రోజు వారి కార్యక్రమాలు నిత్యం సోషల్ మీడియాలో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య, రాష్ట్ర నాయకులు రాజు నాయకు, మల్కజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు ఆనంద్, చంద్ర హాసన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News