Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

three killed in road accident at guntur district

అమరావతి: గుంటూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వేగంగా వచ్చిన వాహనాలు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు వెల్లడించారు.

 

three killed in road accident at guntur district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News