Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

- Advertisement -
- Advertisement -
  • ఒక్కరికి గాయాలు

పటాన్ చెరు: పటాన్‌చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ క్రాస్ రోడ్డు ముంబాయి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే పటాన్‌చెరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మద్యాహ్నం స్కూటిపై సంగారెడ్డి వైపు నుంచి పటాన్‌చెరు వైపు స్కూటీపై వెల్లుతున్న ఇద్దరిను అటుగా వస్తున్న డిసిఎం వ్యాన్ భలంగా బైక్‌ను ఢీ తొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రాంచందర్ (52),సురేశ్ (45) లు అక్కడి కక్కడే రోడ్డుపై దుర్మరణం చెందారు.గాయపడ్డ మరో వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పటాన్‌చెరు ఎస్‌ఐ రామనాయుడు ప్రమాద స్థలంకు హుటాహుటిన చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.అనంతరం గాయపడ్డ క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News