Tuesday, March 19, 2024

భోజనంలో సలాడ్ వేయలేదని భార్యను చంపేశాడు…

- Advertisement -
- Advertisement -

Wife murder by husband in Uttar Pradesh

లక్నో: భోజనంలో సలాడ్ వేయలేదని భార్యను భర్త చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని షామ్లీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మురళీ కుమార్ (50) అనే వ్యక్తి తన భార్య సుదేష్ దేవీ (45), కుమారుడు అజయ్(22) తో కలిసి జీవిస్తున్నారు. మంగళవారం రాత్రి మురళీ మద్యం పూటుగా తాగి ఇంటికి వచ్చాడు. భోజనంలో సలాడ్ కావాలని డిమాండ్ చేశాడు. ఆమె సలాడ్ పెట్టకపోవడంతో భార్యపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మురళీ అర్థరాత్రి మళ్లీ ఇంటికొచ్చి భార్య, కుమారుడిపై దాడి చేశాడు. గ్రామస్థులు వెంటనే దేవీ, అజయ్ ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దేవీ చికిత్స పొందుతూ కన్నుమూయగా అజయ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News