Thursday, March 28, 2024

అపార్ట్‌మెంట్ నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman jumps to death from 5th floor in Hyderabad

శేరిలింగంపల్లి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్కండేయా చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని టెల్కర్స్ అపార్ట్‌మెంట్ లో కుటుంబంతో సహ నివాసముంటు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కాగా గత ఆరు నెలల క్రితం తన చిన్న కుమార్తె శ్రీ విద్యను భూపలపల్లికి చెందిన ముషం షభరీష్ కు ఇచ్చి వివాహం చేశారు.

గత కొంత కాలంగా తన భర్త షభరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీవిద్య తన కుటుంబ సభ్యులకు తెలుపగా వారు తనకు సర్ధిచెప్పి తన భర్త వద్ధకు పంపారు. అదేవిషయమై మానసిక వేధనకు గురైన శ్రీవిద్య తను ఉంటున్న అపార్ట్‌మెంట్ 5వ అంతస్థు నుండి దూకింది. అది గమనించిన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రైవేట్ హస్పీటల్ కు తరలించారు. ఆమెను వైద్యులు పరిశీలించి చనిపోయినట్లు నిర్థ్ధారించారు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News