- Advertisement -
హైదరాబాద్: రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన నగరంలోని ఫిల్మ్నగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….ఫిల్మ్నగర్కు చెందిన జ్యోతిర్మయి ఉదయం రోడ్డుదాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె వేగంగా వస్తున్న టిప్పర్కు తల తగలడంతో కుప్పకూలిపోయింది. తీవ్ర రక్త స్రావం కావడంతో జ్యోతిర్మయి అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే టిప్పర్ డ్రైవర్, ద్విచక్ర వాహనం దారుడు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Woman killed in road accident At Film Nagar
- Advertisement -