- Advertisement -
హైదరాబాద్: వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన యువతి అదృశ్యం కావడంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ప్రాంతం దమ్మాయిగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బనావత్ అమృ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో వెంకటరావునగర్లో నివసిస్తున్నాడు. బనావత్ కుమార్తె శ్వేత(27)కు మే 1 నిశ్చితార్థం చేశారు. అగస్టు 11న ఆమెకు వివాహం జరిగాల్సి ఉంది. బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాకపోవడంతో బంధువులు, తెలిసిన వాళ్ల ఇండ్లలో వెతికారు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తండ్రి బనావత్ ఫిర్యాదు చేశాడు.
- Advertisement -