Thursday, April 25, 2024

యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

Young girl missing

 

శేరిలింగంపల్లి : ఇంట్లోంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యం అయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపి రెడ్డి కాలనీ లో నివాసముంటున్న సరోజకు ఇద్దరు పిల్లలు. తన భర్త యుగేందర్ గత కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పటి నుండి ఆమే తన పిల్లలతో కలిసి పని చేసుకుంటు జీవనం సాగిస్తుంది. తనకు జగదీష్ (15) మరియు సుమ (19) ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పెద్ద కుమార్తే లేపాక్షీ కళశాల లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది.

కాగా సుమ ఈ నెల 2 వ తేదిన ఇంట్లో ఎటువంటి సమచారం ఇవ్వకుండా బయటకు వెళ్లింది. ఎంత సేపటికి తను తిరిగి రాకాపోగా తన ఫోన్ కు కాల్ చేయాగ స్విచ్ ఆప్ వచ్చింది. దాంతో వారికి సంబందించిన కుటుంభ సభ్యులు మరియు ఇతర ప్రాంతాలలో ఎంత వెతికిన తన కూతురు సుమ ఆచూకి లభించలేదు. దాంతో బుధవారం ఆమే సోదరుడు అయిన లోకేష్ కుమార్ తో కలిసి చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అదృశ్యం అయిన సుమ ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Young woman missing in Chanda nagar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News