- Advertisement -
మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతులమీదుగా అందజేత
మనతెలంగాణ, హైదరాబాద్ : సరూర్నగర్లోని బొమ్మనగండి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వి. జీవనజ్యోతి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికైంది. రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన జీవనజ్యోతి ఎం.ఎ, బి.ఈడి చేశారు. తర్వాత 2003లో నిర్వహించిన డిఎస్సీలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. విధి నిర్వహణలో విద్యార్థుల ఎదుగుదలకు విశేషంగా కృషి చేస్తున్న జీవనజ్యోతిని అధికారులు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. వృత్తిపట్ల అంకితభావం ఉన్న జీవనజ్యోతి చాలామంది విద్యార్థులకు తనకు తోచిన సాయం చేసేది. జీవనజ్యోతి భర్త పోలీస్ శాఖలో ఇన్స్స్పెక్టర్గా పనిచేస్తున్నారు.
- Advertisement -