Tuesday, September 17, 2024

‘ఎలక్టోరల్‌ బాండ్‌ స్కామ్‌’ పై దాఖలైన పిటిషన్‌పై జులై 22న విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లను (ఇబి) ఉపయోగించి ఎలక్టోరల్ ఫైనాన్సింగ్‌లో జరిగిన కుంభకోణంపై న్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ల క్లచ్‌ను సుప్రీంకోర్టు జూలై 22న విచారించనుంది.

పిటిషనర్ లాభాపేక్షలేని సంస్థ, ‘కామన్ కాజ్ అండ్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ (సిపిఐఎల్) తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత, ఈ విషయాలు వచ్చే వారం సోమవారంనాడు తేలుస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ధనంజయ వై. చంద్రచూడ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News