Sunday, September 22, 2024

ఎపిలో కొత్తగా 10,167 కేసులు..68మంది మృతి

- Advertisement -
- Advertisement -

6051 New Corona Cases Reported in AP

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న‌ది. దీంతో గత రెండు రోజులుగా రాష్ట్రంలో 10వేల చొప్పున కరోనా కేసుల నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 30వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో ఎపిలో మొత్తం 70,068 శాంపిళ్ల‌ను పరీక్షించగా.. కొత్తగా రికార్డు స్థాయిలో 10,167 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 68 మంది మ‌ర‌ణించినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,30,557కు చేరుకుంది. ఇప్పటివరకు ఎపిలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 1,281కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 69,234మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 57,147 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు మొత్తం 18 లక్షల 90వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

10167 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News