- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,058 కోవిడ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 1,440 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,60,834కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,682 యాక్టివ్ కేసులుండగా… 2,46,733 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు మొత్తం 1,419 మంది మృతి చెందారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 10,352 మంది చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ 168, మేడ్చల్ లో 93, రంగారెడ్డిలో 91 కొత్త కరోనా కేసులు బయపడ్డాయి.
1058 new covid-19 cases reported in telangana
- Advertisement -