Sunday, February 23, 2025

జమ్మూ కశ్మీర్ లో లోయలో పడిన బస్సు: 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

11 killed in Jammu & Kashmir road accident

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం పూంచ్‌లోని సాజియాన్ ప్రాంతంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 11 మంది మృతి చెందగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది మర్మూ దిగ్భ్రాంతి వ్యక్తం  చేశారు. మృతుల పట్ల సంతాపం తెలిపగా బాధితుల కుటుంబాలకు ఆమె సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News