Friday, April 25, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం….

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని 70,902 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,858 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News