Monday, March 31, 2025

తిరుమలలో 15 కంపార్టుమెంట్లు ఫుల్.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈక్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇక, గురువారం శ్రీవారిని 56,225 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. మొత్తం 19,588 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News