Friday, October 18, 2024

రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

156 new covid-19 cases in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 156 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,71,946కు పెరిగింది. తాజాగా 135 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,64,033 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,953కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.82 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,953 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News