Sunday, September 22, 2024

దేశంలో కొత్తగా 16,906 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

16906 new covid cases reported in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 45 మంది బాధితులు కరోనా మహామ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,447 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 1,32,457 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.68 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 199.12 కోట్ల మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News