యాదాద్రి భువనగిరి జిల్లా తుంగుతర్తి నియోజవకర్గ పరిధిలోని అడ్డగూడురు మండలంలో జరిగిన హత్యకేసులో నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ, జిల్లా రెండో అదనపు జడ్జి రోజా రమణి మంగళవారం 17 మందికి జీవిత ఖైదీ విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించారు. శిక్ష పడిన వారిలో ఓ మాజీ సర్పంచ్ ఉన్నారు. 2017లో పాత కక్షల నేపథ్యంలో అడ్డగూడూరు మండలం హజీంపేటలో ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తిని 2017లో 18మంది కలిసి హత్య చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు పెండింగ్ లోఉన్నది. కాగా, మంగళవారం కేసు ఫైనల్ కు వచ్చింది. నిందితుల్లో ఓ వ్యక్తి అప్పటికే మృతి చెందారు. పూర్తి సాక్షాధారాలను పోలీసులు కోర్టులో ప్రేవేశపెట్టగా..కేసు పూర్వాపరాలు పరిశీలించి న్యాయమూర్తి రోజారమణి, 17 మందికి యావజ్జీవ కారాగారా శిక్ష విధించారు. జడ్జిమెంట్ అనంతరం దోషులు,వారి కోసం వచ్చిన కుటుంబసభ్యుల రోదనలతో కోర్టు ఆవరణలో దద్దరిల్లిపోయింది. నల్లగొండ ట్రాఫిక్ సీఐ రాజు, మహిళా పోలీస్స్టేషన్ ఎస్ఐ విజయ భారీ బందోబస్తు ఏర్పాటు మధ్య దోషులను జైలుకు పంపించారు.
హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -