Sunday, February 23, 2025

18 నుంచి వరల్డ్ కప్ క్వాలిఫయర్ సమరం

- Advertisement -
- Advertisement -

దుబాయి : భారత్ వేదికగా ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించి క్వాలిఫయర్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం ప్రకటించింది. జూన్ 18 నుంచి జింబాబ్వేలో క్వాలిఫయర్ పోటీలు జరుగనున్నాయి. ఈ అర్హత పోటీల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంకలతో సహా నేపాల్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఒమాన్, యుఎఇ, నెదర్లాండ్స్, యుఎస్‌ఎ జట్లు పాల్గొననున్నాయి.

ఈ టోర్నీలో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో వెస్టిండీస్, నెదర్లాండ్స్, యుఎస్‌ఐ, గ్రూప్‌బిలో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమాన్, యుఎఇ జట్లు ఉన్నాయి. ఇక లీగ్ దశలో టాప్3లో నిలిచే జట్లు సూపర్6కు చేరుకుంటాయి. సూపర్6లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News