Sunday, September 22, 2024

దేశంలో కొత్తగా 18,563 కేసులు.. 507మంది మృతి

- Advertisement -
- Advertisement -

Corona Cases

న్యూఢిల్లీః భారత్‌లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,563 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 507 మంది బాధితులు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,85,493కు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 17,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో 2,20,114 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,47,979 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

18563 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News