కొత్తగా 191 పాజిటివ్లు, 8 మంది మృతి
జిహెచ్ఎంసిలో 143, జిల్లాల్లో 48 మందికి వైరస్
మేయర్ పేషిలో ఒక అటెండర్కు, ముగ్గురు మీడియ ఉద్యోగులకు పాజిటివ్
సింగరేణి యూనియన్ నాయకుడుకీ సోకిన కోవిడ్
4111కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 4వేలు దాటింది. కొత్తగా 191 పాజిటివ్లు నమోదు కాగా, మరో 8 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీనిలో జిహెచ్ఎంసి పరిధిలో 143, జిల్లాల్లో 48 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసి మేయర్ షేషిలో పనిచేసే అంటెండర్తో పాటు ముగ్గురు తెలుగు ఛానెల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాటు సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్లో క్రియశీలకంగా పనిచేసే ఓ నాయకుడికీ వైరస్ తేలిందని అధికారులు స్పష్టం చేశారు. అతన్ని ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేసినట్లు ఆ జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా మరో 191 కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు.
దీనిలో జిహెచ్ఎంసి పరిధిలో 143 మంది, జిల్లాల్లో 48 మందికి వైరస్ నిర్ధారణ అయింది. అయితే మరణించిన వారి పూర్తి వివరాలు బులిటెన్లో పేర్కొనలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ల 4111కి చేరగా, వీటిలో రాష్ట్రానికి చెందిన కేసులు 3663, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 448 మంది ఉన్నారు. ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకోని ఆరోగ్యవంతులుగా 1817 మంది ఇళ్లకు చేరగా, ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 2138 మంది చికిత్స పొందుతున్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 156 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నారు.
బుధవారం పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలు…..
జిల్లా కేసుల సంఖ్య
జిహెచ్ఎంసి 143
మేడ్చల్ 11
సంగారెడ్డి 11
రంగారెడ్డి 8
మహబూబ్నగర్ 4
జగిత్యాల 3
మెదక్ 3
నాగర్కర్నూల్ 2
కరీంనగర్ 2
నిజామాబాద్ 1
వికారాబాద్ 1
నల్గొండ 1
సిద్దిపేట్ 1
మొత్తం 191
ఇప్పటి వరకు కరోనా కేసుల వివరాలు ఇలా….
రాష్ట్రానికి చెందినవి 3663
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కేసులు 448
మొత్తం కేసులు 4111
వీటిలో….
డిశ్చార్జ్ల సంఖ్య 1817
యాక్టివ్ కేసులు 2138
మరణాల సంఖ్య 156