Sunday, April 27, 2025

రాష్ట్రంలో కొత్తగా 1,920 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

1920 new covid cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,920 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,97,775కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,015, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 209, రంగారెడ్డి జిల్లాలో 159 మందికి అత్యధికంగా కరోనా సోకింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,045కు చేరింది. తాజాగా కరోనా నుంచి 417 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,77,234 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 97.05 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,496 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 15,969 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News