Thursday, February 13, 2025

19న కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రకార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఈనెల 19 వ తేదీన నిర్వహించాలని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె.టి.రామారావును ఆదేశించారు. అధినేత ఆదేశాల మేరకు వచ్చే బుధవారం మధ్యాహ్నం 1 గంటనుండి నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనున్నది. అధినేత కెసిఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు…పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలతో కూడిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు.

బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై సమావేశంలో విస్తృతస్థాయిలో చర్చించనున్నట్లు కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలమీద ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై సమగ్ర చర్చించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై ఈ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని తెలిపారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ కశ్చితంగా హాజరుకావాలని కెటిఆర్ పార్టీ శ్రేణులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News