Wednesday, September 18, 2024

శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద తగ్గుతోంది. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తేసి 2.75 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. శ్రీశైల ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 3.79 లక్షల క్యూసెక్కులుండగా ఔట్‌ఫ్లో 3.59 లక్షల క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుతం 883.9 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 215.8 టిఎంసిలుకాగా ప్రస్తుతం నీటి నిల్వ 209.59 టిఎంసిలకు చేరుకుంది.

పోతిరెడ్డిపాటు హెడ్‌రెగ్యులెటరీ నుంచి 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 1600 క్యూసెక్కుల, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 21,432 క్యూసెక్కుల, ఏడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News