Sunday, February 23, 2025

బీహార్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు బందిపోటు దొంగలు హతం

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ లో ఇద్దరు బందిపోటు దొంగలను పోలీసులు హతమార్చారు. సోమవారం ఉదయం తూర్పు చంపారన్ జిల్లా ఘోరసహన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, బందిపోటు దొంగలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు దొంగలు మరణించగా, ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.

గాయపడిన పోలీసులను చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి తరలించినట్లు మోతిహారి ఎస్పీ కంతేష్ కుమార్ మిశ్రా తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి లైవ్ బాంబులు, పిస్టల్, గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పారిపోయిన బందిపోటు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Also Read: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది దుర్మరణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News