Thursday, April 24, 2025

అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందగా మరోకరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. వివరాలు 12 మంది పర్యాటకులతో వెళ్తున్న పడవ అలల తాడికి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది గల్లంతయ్యారు.

అయితే 10 మంది ప్రాణాలతో బయటపడగా.. ఒకరు మృతిచెందారు. కాగా.. మరొకరి కోసం గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే పర్యాటకులు లైఫ్ జాకెట్లు వేసుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, పడవలోని పర్యాటకులంతా తంజావురు వాసులుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News