Sunday, February 23, 2025

ఆర్మూర్‌లో అక్క, చెల్లెలు దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌ః జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో ఇద్దరు అక్క, చెల్లెలు దారుణంగా హత్యకు గురయ్యారు. కొందరు గుర్తుతెలియని దుండగులు..గంగవ్వ, రాజవ్వ అనే ఇద్దరు వృద్ధ అక్కాచెల్లెలపై దాడి చేసి చంపారు. తలపై మారణాయుధాలతో కొట్టి దారుణంగా హత్య చేసి పారిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన దుండగలను పట్టుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News