Friday, September 20, 2024

ఢిల్లీలో మరణ మృదంగం… ఆక్సిజన్ లేక 20 మంది రోగులు మృతి

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో మరణ మృదంగం మోగుతోంది. శనివారం జైపూర్‌ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో 20 మంది కరోనా రోగులు మృతి చెందారు. మరో అర గంట పాటు ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయని గోల్డెన్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆక్సిజన్ కొరతతో మరో 200 మందికి పైగా కోవిడ్‌ రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆక్సిజన్‌ నిల్వలు లేక ఢిల్లీలోని సరోజ్‌ ఆస్పత్రిలో అడ్మిషన్లు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతమున్న రోగులను సరోజ్‌ ఆస్పత్రి వర్గాలు డిశ్చార్జి చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News