Tuesday, April 8, 2025

21 మంది ఐపిఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 21 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చే స్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషినల్ డిజి, ఇద్దరు ఐజిలు, ఇద్దరు డిఐజిలు, ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీ లు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థాన చలనం కల్పించారు. కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా గౌస్ ఆలం, అదనపు డిజి (పర్సనల్)గా అని ల్‌కుమార్. ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు, సిఐడి డిజిగా ఎం.శ్రీనివాసులు, వరంగల్ సిపిగా సన్‌ప్రీత్‌సింగ్, నిజామాబాద్ సిపి గా సాయి చైతన్య, రామగుండం సిపిగా అంబర్ కిషోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ, భువనగిరి డిసిపిగా ఆకాంక్ష యాద వ్, మహిళా భద్రతా విభాగం ఎస్పీగా చేతన, నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా జిఎం బాబా సాహెబ్, వరంగల్ డిసిపిగా అంకిత్ కుమా ర్, మంచిర్యాల డిసిపిగా ఎ.భాస్కర్, సూర్యాపేట ఎస్పీగా కె.నర్సిం హా, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపిగా శిల్పవల్లి, ఎస్‌ఐ బి ఎస్పీగా సాయి శేఖర్, పెద్దపల్లి డిసిపిగా కరుణాకర్, సిఐడి ఎస్పీగా రవీందర్ నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News