- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 12,771 నమూనాల పరీక్షించగా 210 మందికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఎపి వైద్య ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దీంతో ఎపిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,588కి చేరాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 41మందితో పాటు, ఎనిమిది మంది విదేశీయులకు కరోనా సోకింది. రాష్ట్రంలోని 161మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 73మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆంధ్రలో 1,192 యాక్టివ్ కేసులుండగా.. 2,323 మంది బాధితులు కోలుకున్నారు.
210 New Corona Positive Cases Registered in AP
- Advertisement -