చెన్నై: తమిళనాడులో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచన 24 గంటల్లోనే రాష్ట్రంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదైనట్లు, కరోనాతో మరో 49 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,334కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 625 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 23,065 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా నుంచి ఇప్పటివరకు 28,641 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా, తమిళనాడులో ప్రతీరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న చెన్నైతోపాటు పలు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
2141 New Corona Cases Reported in Tamil Nadu