Saturday, September 21, 2024

కేశాపురంలో కారు బోల్తా.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

3 Killed in Road Accident in AP's Keshavapuram

అమరావతి: కారు బోల్తా పడి ముగ్గురు చనిపోయిన ఘటన అన్నమయ్య జిల్లా కేశాపురంలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కేశాపురం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు, చెట్టును ఢీకొట్టి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మరొకరు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు చిన్నమండె మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

3 Killed in Road Accident in AP’s Keshavapuram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News