Thursday, September 19, 2024

24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్‌లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

3 Terrorists Killed In Encounter In JK

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కుల్గామ్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. బట్పోరా, అహ్వాతూ ఏరియాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బట్సోరా ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్ ఎ మహ్మద్ సంస్థకు చెందిన పాకిస్థాన్ ఉగ్రవాది హతమయ్యాడు. కశ్మీర్ ఏరియాలో జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో అతని హస్తం ఉందని పోలీసులు చెప్పారు అహ్వాతూ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్ ఏ మహ్మద్‌కే చెందిన స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ ప్రదేశాల నుంచి భారీగా మారణాయుధాలను , మందుగుండ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం కుల్గామ్ జిల్లాలో పరిస్థితి అదుపు లోకి వచ్చిందని, అయినప్పటికీ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News