Saturday, March 29, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి కంపార్టుమెంట్లు అన్ని నిండిపోవడంతో నందకం అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని 82,882 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 44,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో హుండీ ఆదాయం రూ.40.9 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News