Sunday, September 22, 2024

ఎపిలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 3,224 కేసులు

- Advertisement -
- Advertisement -

గ‌డిచిన 24 గంట‌ల్లో 61,112మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 3,224 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 61,112మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 3,224 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 32మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 7,58,951కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 6,256మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 43,9833మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,084మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి మొత్తం 7,08,712మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 78,834,0096మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

3224 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News