Sunday, September 8, 2024

అయోధ్య సందర్శించిన 325మంది యుపి చట్టసభ్యులు

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాది పార్టీకి చెందిన వారు తప్ప ఉత్తరప్రదేశ్‌కు చెందిన 325 మంది లెజిస్లేటర్లు ఆదివారం అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో లెజిస్లేటర్లు రావడంతో అయోధ్య వాసుల్లో సైతం ఉత్సాహం ఉరకలు వేసింది. వారు ఎంఎల్‌ఎలపై పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. పుణెనుంచి అయోధ్యకు చేరుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తన మంత్రివర్గ సహచరులతో కలిసి రామమందిరాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా రామమందిరం కాంప్లెక్స్‌లోని జనమంతా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. తన సహచరులతో కలిసి తాను ప్రభు శ్రీరాముడికి చెందిన భవ్య మందిరంలో పూజలు జరిపినట్లు ఎక్స్‌లో ఉంచిన పోస్టులో యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహనాతో పాటుగా కొంతమంది లెజిస్లేటర్లు ‘రఘుపతి రాఘవ రాజారాం’ భజనను పాడున్న దృశ్యాలతో పాటుగా మరి కొంతమంది లెజిస్లేటర్లు మందిరం మెట్లపై కూర్చుని గ్రూపు ఫోటోలకు పోజులిస్తున్న దృశ్యాలు 14 నిమిషాల ఆ వీడియోలో ఉన్నాయి.

ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో కలిసి 325 మందికి పైగా లెజిస్లేటర్లు అయోధ్యలో భగవాన్ శ్రీరాముడిని సందర్శించారు. కొంత మంది ఎంఎల్‌ఎల సతీమణులు కూడా వారి వెంట ఉన్నారు. బృందంలో మొత్తం అందరూ కలిసి 400 మందికి పైగానే ఉన్నారు’ అని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి చెందిన అదికారి ఒకరు చెప్పారు. లక్నోనుంచి పది బస్సుల్లో అయోధ్య వచ్చిన వీరంతా దర్శనం తర్వాత తిరిగి రాష్ట్ర రాజధానికి బయలుదేరినట్లు ఆ అధికారి చెప్పారు. అయితే సమయాభావం కారణంగాను, రద్దీ ఎక్కువగా ఉన్నందున వీరు అయోధ్యలోని హనుమాన్ గడీ ఆలయాన్ని దర్శించుకోలేదని రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ ప్రసాద్ విలేఖరులకు చెప్పారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య విలేకరులతో మాట్లాడుతూ, ఎంతగానో ఎదురు చూస్తున్న భగవాన్ రాముడి దర్శనం లభించింది. భక్తులకు ఆ రాముడి ఆశీస్సులు కూడా లభించి ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డమే కాకకుండా 400కు పైగా సీట్లు లభిస్తాయి. 2027లో జరిగే యుపి ఎన్నికల్లో బిజెపి 300కు పైగా స్థానాలు గెలుచుకుంటుంది’ అని చెప్పారు.

సమాజ్‌వాది పార్టీ యాత్రలో పాల్గొనడానికి నిరాకరించడం గురించి మౌర్య, మరో ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్‌లు మాట్లాడుతూ బహుశా రామభక్తులపై కాల్పులకు ఆదేశించిన కారణంగా వారు ఈ పర్యటనకు దూరంగా ఉండి ఉండవచ్చని, వారి మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల్లో ఇది ఒక భాగమని అన్నారు. అయితే సమాజ్‌వాది పార్టీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డి) అయోధ్య యాత్రలో పాలుపంచుకోవడం గమనార్హం. సమాజ్‌వాది పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలకు చెందిన లెజిస్లేటర్లు అయోధ్యకు వెళ్లడానికి తమ అంగీకారం తెలిపారు. యుపి ఎంఎల్‌ఎలు మొదట ఫిబ్రవరి 1న అయోధ్య సందర్శించాలని అనుకున్నారు. అయితే పెద్ద సంఖ్యలో అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News