Sunday, September 22, 2024

ఎపిలో మరో 34 పాజిటీవ్ కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

 Corona test

 

అమరావతి:రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) చాపకింద నీరులా విస్తరిస్తుంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు కొత్తగా మరో 34 పాజిటీవ్ కరోనా కేసులు నమోదైనట్లు ఎపి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  473కు చేరగా.. ఇందులో 14మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటికి తొమ్మిది మంది మరణించారు. ఇక, దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,752కు చేరగా, 360 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజునే తెలంగాణలో 58 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 592 కరోనా కేసులు నమోదు కాగా.. 17 మంది మృతి చెందారు.

34 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News