Sunday, February 23, 2025

రాష్ట్రంలో కొత్తగా 374 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

374 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 39,579 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…374 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,87,437కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 683 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,78,850 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.91 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.52 శాతంగా ఉంది.మరో 1,193 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News