Sunday, September 22, 2024

ఎపిలో కొత్తగా 3,892 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 69,463 నమూనాలు పరీక్షించగా 3,892పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 69,463 నమూనాలు పరీక్షించగా 3,892పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,465కు చేరింది. కొత్తగా 28 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,319కి చేరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 5,050 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 67,72,273 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 41,669 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

3892 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News