బంగారం నిల్వల్లో మొదటిస్థానంలో
వేములవాడ రాజన్న దేవస్థానం
97కిలోలతో అగ్రస్థానం 67కిలోలతో
రెండోస్థానంలో భద్రాచలం 61కిలోలతో
మూడో స్థానంలో యాదగిరిగుట్ట
ఆలయం రాష్ట్రంలోని దేవాలయాల
వద్ద మొత్తం1,048 కిలోల
బంగారం, 38వేల కిలోల వెండి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అ న్ని ఆలయాల కన్నా వేములవాడ రాజన్న ఆల యం అత్యధిక సంపద గల దేవాలయంగా నిలిచింది. 97 కిలోల బంగారంతో రాజన్న రాష్ట్రంలోనే మొదటిస్థానంలో దక్కించుకున్నారు. ఇక రెండోస్థానాన్ని భద్రాచలం రామయ్య (67 కి లోల బంగారం), మూడోస్థానం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వద్ద (61 కిలోల) ద క్కింది. రాష్ట్రంలోని మిగతా ఆలయాల కన్నా ఈ దేవుళ్లు అత్యంత ధనవంతులుగా పేరుగడించా రు. దీంతోపాటు భక్తులు అత్యధికంగా దర్శించుకునేఆలయాల్లోనూ ఈమూడు ఆలయాలే ముం దంజలో ఉండడం విశేషం. భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారాన్ని మాత్రమే… రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు యాదగిరిగు ట్ట, భద్రచాలం, వేములవాడతో పాటు మిగతా ఆలయాలకు సంబంధించిన బంగారం,
విరాళాలతో ఆలయాల అభివృద్ధిని చేపట్టాలని దేవాదా య శాఖ భావిస్తోంది. అందులో భాగంగా ఏయే ఆలయానికి ఎంత బంగారం ఉంది, ఆ బం గారం వల్ల ఆలయాల అభివృద్ధికి ఎంతమేర మే లు జరుగుతుంది, దాంతో ఎలా అభివృద్ధి చేయవచ్చన్న దానిపై అధికారులు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. మెుత్తంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల వద్ద 1,048 కేజీల బంగారం ఉన్న ట్లు దేవాదాయశాఖ అధికారుల గణాంకాలు స్ప ష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత ఈ బంగారం స్థా నికంగా ఉన్న బ్యాంకుల్లోని లాకర్లలో భద్రపరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఇలా లాకర్లో బంగారం మూలుగుతోంది. అయితే దాని ద్వా రా ఆయా ఆలయాలను అభివృద్ధి ఎలా చేయచ్చ న్న దానిపై దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కాగా, భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారాన్ని మాత్ర మే ప్రభుత్వ అనుమతి మేరకు కరిగించే అవకా శం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. త్రిస భ్య కమిటీ ఆమోదం తర్వాత ఆలయాల అవసరం మేరకే బంగారం కరిగించే చాన్స్ ఉంది. ఏ ఆలయానికి సంబంధించిన బంగారం ఆ ఆల యం పరిధిలోనే ఉంటుంది. తెలంగాణలో మెు త్తం 704 ఆలయాలు ఉండగా ఆదాయాన్ని బ ట్టి ఆయా ఆలయాలను రీజనల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ), జిల్లా కమిషనర్(డిసి), అసిస్టెంట్ కమిషనర్ (ఎసి)లకు బాధ్యతలు అప్పగించింది. ఆర్జేసీలుగా ఉన్న ఆలయాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట ఆలయాలు ఉన్నాయి. డిసి కేడర్లో కొండగట్టు ఆంజనేయస్వామి, కొమరవెల్లి మల్లికార్జునస్వామి, బాసర సరస్వతీ ఆలయం, సికింద్రాబాద్లోని గణేశ్ ఆలయం ఉన్నాయి. ఎసి కేడర్లో మరో 13 ఆలయాలు ఉన్నాయి. మిగిలిన టెంపుల్స్ 6(ఏ), (బి), (సి), (డి) కేటగిరీ పరిధిలో ఉన్నాయి. ఈ మెుత్తం ఆలయాల్లో 1,048 కేజీల బంగారం ఉంది.
రాజన్న ఆలయం వద్ద 4,930 కిలోల వెండి
వెండి విషయానికొస్తే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కలిపి మొత్తంగా 38,783 కిలోల వెండి ఉన్నట్టు అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. అందులోనూ రాజన్న ఆలయం వద్ద 4,930 కిలోలు, యాదగిరి గుట్ట ఆలయం వద్ద 2,312 కిలోలు, భద్రాచలం ఆలయం వద్ద 980 కిలోల వెండి ఉంది. డిసి కేడర్లో ఉన్న 4 ఆలయాల్లో 3,331 కిలోలు ఉండగా ఎసి కేడర్లో ఉన్న 13 ఆలయాల్లో 4,415 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. 6(ఏ), (బి), (సి), (బి) కేటగిరీ పరిధిలో 22,811 కిలోల వెండి ఉంది.