Sunday, March 16, 2025

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో పుట్టిన రోజు వేడుకులకు వెళ్తున్న కారు టూ వీలర్‌ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు విశాఖపట్నం బయల్దేరారు. పుట్టిన రోజు వేడుకుల కకోసం ఆనందంగా వెళ్తున్న వారి జీవితాల్లో విషాదం నెలకొంది. వారు ప్రయాణిస్తున్న కారు టూ వీలర్‌ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో టూవీలర్‌పై వెళ్తున్న ఇద్దిరితోపాటు కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు స్పాట్‌లోనే దుర్మరణం చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాలిదాసు, కుసుమ అనే ఇద్దరు గాయాలు పాలయ్యారు. వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన తెలియడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News