Monday, February 10, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

దక్షిణ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున  బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 41 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 39 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు.. సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News