Sunday, February 23, 2025

కొత్తగా 462 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

462 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,518 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…462 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,01,406కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 403 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,92,593 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.90 శాతంగా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,702 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 516 మంది ఫలితాలు రావాల్సి ఉంది. అత్యధికంగా హైదరాబాద్‌లో 259 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 35, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News