Thursday, April 24, 2025

కొత్తగా 496 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

496 new covid cases reported in telangana

క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య

హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో శనివారం 28,808 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 496 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారి నుంచి 205 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,613 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 341 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ మల్కాజిగిరిలో 40, సంగారెడ్డిలో 15 కేసులు నమోదయ్యాయి. మరో 342 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News