Sunday, February 23, 2025

సరూర్ నగర్లో ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సరూర్ నగర్లో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్ లో వి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తన భార్య లత, ముగ్గురు కుమారులతో కలిసి వెంకటేశ్వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

స్థానికుల సమాచారంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న సరూర్ నగర్ పోలీసులు కుటుంబం మొత్తాన్ని వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు సరూర్ నగర్ పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News