Tuesday, September 17, 2024

ఓఆర్‌ఆర్ పరిధిలోని 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్: ఓఆర్‌ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయి. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్ తారామతిపేట పంచాయతీలు విలీనమయ్యాయి. శంషాబాద్ మున్సిపాలిటీలో బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ విలీనం చేశారు. నార్సింగి మున్సిపాలిటీలో మీర్జాగూడ గ్రామపంచాయతీ , తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామపంచాయతీ, మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి.

దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి, నాగారం మున్సిపాలిటీలో బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు, పోచారం మున్సిపాలిటీలో వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం చేశారు. అలాగే ఘట్‌కేసర్ మున్సిపాల్టీలో అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనమయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు తూంకుంట మున్సిపాలిటీలో బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News