Sunday, February 23, 2025

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

- Advertisement -
- Advertisement -

మెరేనా: మధ్యప్రదేశ్‌లోని మెరేనా జిల్లాలో శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. మృతులలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ సంఘటనలో ముగ్గురు ఇతరులు కూడా గాయపడ్డారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మెరేనాకు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపా గ్రామంలో ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది.

ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా తుపాకీ తూటాలతో గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు చంబల్ జోన్ ఐజి ఎస్ సక్సేనా తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. హత్యకు పాతక్షకలే కారణమని తెలుస్తోంది. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న 8మంది వ్యక్తులను పోలీసులు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. హత్యకు గురైన వారి బంధువులే ఈ హత్యాకాండలో పాల్గొన్నట్లు తెలుస్తోందని ఐజి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News