Saturday, June 29, 2024

ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు

- Advertisement -
- Advertisement -

1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు
వీటికి 487 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సిఎం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా శనివారం ఈ నిధులను విడుదల చేస్తూ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకం కింద కొత్త చికిత్సా విధానాల కోసం, ప్రస్తుతమున్న పథకాల ఆర్థిక సవరణ కోసం మంత్రి భట్టి విక్రమార్కతో జూన్ 7న సచివాలయం లో సమావేశము జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వము 2007 లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పధకం ప్రెవేశపెట్టింది. ఈ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు.

వీరికి 10 లక్షల వరకు ఆర్ధిక సహాయం ఈ పధకం ద్వారా అందుతుంది. రాష్ట్రం లో ఈ సదుపాయము 1402 ఆసుపత్రుల ద్వారా అందించబడుతుంది. ప్రస్తుతము ఈ పధకం లో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూస కు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇకనుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు.

వీటికి తోడు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ లో ఉన్న 98 చికిత్సా విధానాలు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు 189.83 కోట్ల భారం ప్రభుత్వం పై పడనుంది. 65 కొత్త చికిత్సా విధానాలు అంగీకరించడం వల్ల ప్రభుత్వo 158.20 కోట్ల ఖర్చు చేయనుంది. పై సవరణల వల్ల, కొత్త చికిత్సా విధానాలు చేర్చడం వల్ల, ప్రభుత్వం అదనంగా 497.29 కోట్లు ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మంజూరు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News