Sunday, February 23, 2025

ప్రకాశం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ప్రకాశం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. మంగళవారం తెల్లవారుజామున దర్శి ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి నాగార్జునసాగర్ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి, 18 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పెళ్లిబృందం బస్సు పొదిలి నుంచి కాకినాడకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News